చల్లా మధును ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. చల్లా మధుగా వైసీపీ శ్రేణులందరకూ చిరపరిచితుడైన చల్లా మధుసూదన్ రెడ్డి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఎంతో కష్టపడ్డారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలంగా ఎంతగానో కృషి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉంటూ…. పార్టీకోసం హైదరాబాద్ వచ్చేసి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ, జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా, ఆయన ఆశయాలకు కార్యరూపం ఇస్తూ పార్టీలో పనిచేసిన చల్లా మధుకు ఈ అవకాశం లభించడం పట్ల పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
