Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు

వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారుల పని తీరులో మార్పు మాత్రమే కాకుండా ప్రజలకు సైతం తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక భరోసా వచ్చిందని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేసేందుకు ఆన్లైన్ సేవలు సైతం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న జగన్. అందులో భాగంగా దీనితో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారు. ఇక స్పందన సేవలను మరింత విస్తృతం చేయాలని భావించిన జగన్ సర్కార్ అందుకు ఆన్లైన్ సేవలను, టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసిన అర్జీ పరిస్థితి తెలుసుకునేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ : 1800-425-4440 , మరియు spandana.ap.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఎవరయినా ఎక్కడినుంచైనా నేరుగా ఆన్‌లైన్‌లో తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పంపించే వెసులుబాటు కల్పించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat