Home / ANDHRAPRADESH / అరకులోయలో ఆదివాసీలకోసం జగన్ చేసిన, చేయబోతున్న కార్యక్షమాలు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో.?

అరకులోయలో ఆదివాసీలకోసం జగన్ చేసిన, చేయబోతున్న కార్యక్షమాలు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో.?

వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ఇచ్చిన ప్రతీ మాటను, హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలకు అండగా ఉండేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా 300కోట్ల విలువైన వరాలను ప్రకటిస్తూ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ వంటి 27 స్కూల్‌ భవనాలను ఆదివాసీ దినోత్సవం రోజునే ప్రారంభిస్తారు. అధునాతన సౌకర్యాలతో రూ.44 కోట్లతో వీటిని నిర్మించారు. 15తో వ్యవసాయ పరికరాలను కాఫీ తోటలు పెంచుతున్న రైతులకు పంపిణీ చేస్తారు. గిరిజనులు సేకరించే ఫలాలు, పండించే పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా సంతలు నిర్వహించే ప్రాంతాల్లో గోడౌన్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించనున్నారు.. వీటికి ఆదివాసీ దినోత్సవం రోజున శంకుస్థాపన చేస్తారు. గిరిజన గూడేల్లో ఇంటర్నెట్‌ సేవలందించేందుకు ‘గిరి సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసీ పిల్లలకు హక్కుల్ని తెలియ జేయటం, వారి పూర్తి డేటా సేకరించేందుకు అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూ.25 కోట్లు వెచ్చించనుంది. జగన్ అధికారం చేపట్టిన తరువాత 70 రోజుల్లోనే ఆదివాసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసారు. 12,293 మంది గిరిజనులకు వార్డు, పంచాయతీ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలివ్వనున్నారు. ఇప్పటికే 23వేలమందిని వలంటీర్లుగా నియమించారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద సంవత్సరానికి 4,988 కోట్లు కేటాయించింది. గత ఏడాది చంద్రబాబు కేటాయించిన దానితో పోలిస్తే ఇది రూ.811 కోట్లు ఎక్కువ. పోస్టు మెట్రిక్‌ చదువుకుంటున్న 66వేల మంది గిరిజన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల వంతున రూ.132.11 కోట్లు కేటాయించింది. వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద గిరిజన వధువుకు ఇచ్చే సాయాన్ని 50 వేల నుంచి లక్షకు పెంచింది. గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, పాడేరులో మెడికల్‌ కాలేజీ, ఎవరైనా ప్రమాద వశాత్తు మరణిస్తే వైఎస్సార్‌ ప్రమాద బీమా కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. గిరిజన రైతుల కోసం వ్యవసాయ బోర్లు వేసేందుకు రూ.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అరకులో నిర్వహించే రాష్ట్రస్థాయి ఆదివాసీ ఉత్సవాలను ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖా మంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తున్నారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు స్వాతంత్ర్యం వచ్చిన ఏ ముఖ్యమంత్రి తమకోసం చేపట్టలేదని ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు రుణపడి ఉంటామని చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat