ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసులను నియమించి అక్రమ మద్యం ,నాటు సారాలను అరికట్టే చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గిందన్నారు. అక్టోబరు నుంచి 20 శాతం మద్యం దుకాణాలు, బార్లను తగ్గించడమే కాకుండా, దశలవారీగా మద్య నిషేధం అమలుకి అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి,మద్యం వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
