గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు.. ఆ పరీక్ష రాసింది కూడా మొత్తం 70వేలమంది మాత్రమే.. క్వశ్చన్ పేపర్ లో కూడా మొత్తం తప్పుల తడకేనట.. తెలుగు మీడియం విద్యార్థులు బయటికి వచ్చి తీవ్ర నిరుత్సాహ పడ్డారు. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ని గూగుల్ ట్రాన్స్లేటర్ లో వేసి పేస్ట్ చేసి కనీసం క్రాస్ చెక్ కూడా చేయలేదట.. BICAMERALISM అనే పదాన్ని తెలుగులో ద్విసభ విధానం అంటారు అయితే అది క్వశ్చన్ పేపర్ లో అది రెండు కెమెరాల విధానం అని పడింది. ఇలా మొత్తం 30ప్రశ్నలు వచ్చాయి. అలాగే దానికి ముందు జరిగిన గ్రూప్2 పేపర్ కూడా లీక్ అయిందంటూ విద్యార్ధులు గొడవ చేసారు. ఇచ్చే అరకొర జాబ్స్ లో కూడా సవాలక్ష ఇబ్బందులకు గురిచేసారు. అయితే ఇప్పడు జగన్ పాలనలో 22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ఎక్కడా చిన్న ఘటన కూడా జరగలేదు.. పేపర్ లో తప్పులు అనే గొడవ లేదు.. నా పథకాలు, నాప్రభుత్వం అనే సొంత డప్పులేదు.. కనీసం ముఖ్యమంత్రి పేరు ఎక్కడా లేదు.. ఇంతకుముందు exam సెంటర్ లో బ్యాగ్, మొబైల్ పెట్టాలంటే 20 రూపాయలు కట్టాలి.. ఈసారి ఆశ వర్కర్స్ తో భద్ర పరిచారు.. వారిని ఆ పనికి వాడుకుని విద్యార్థుల వద్ద 20 రూపాయల సేవ్ చేశారు.. దూరం నుండి వచ్చిన వారికి భోజనం కూడా ఏర్పాటుచేశారు… ఈ వ్యక్తినే అనుభవం లేదన్నారు.. కానీ ఆ 22లక్షల మందికి తెలుసు.. అయినా టీడీపీ, జనసేన ఎంత అసత్య ప్రచారం చేసినా సీఎం పట్టించుకోవట్లేదు.. ఆయన తనపని తాను చేస్తున్నాడు.
