తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దుచేస్తున్నట్టు ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. సామాన్య భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. L1, L2, L3 విఐవీ దర్శనాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దర్శనాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. దేవుని ముందు అందరిని సమానంగా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. శబరిమలై ఆలయ వివాదం సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటీషనర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బ్లూ, ఎల్లో బుక్ వారికి మాత్రమే..ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాల అవకాశం ఇవ్వవచ్చు అని హైకోర్ట్ ఆదేశించింది. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను టీటీడీ ఇప్పటికే రద్దు చేయడంతో పిటీషన్ను కొట్టి వేసింది. వీవీఐపీ, వీఐపీ సెక్యూరిటీ పర్పస్ లో ప్రత్యేక దర్శనాన్ని అమలు చేయవచ్చు అని హైకోర్ట్ అభిప్రాయపడింది. ఇక ప్రోటోకాల్ దర్శనాలను యధావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది.
