Home / 18+ / ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.. రాజధానిని మార్చుతానంటే నేను ఒప్పుకోను.. పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి

ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.. రాజధానిని మార్చుతానంటే నేను ఒప్పుకోను.. పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి

వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అల్టిమేటం జారీచేశారు. రాజధాని అమరావతినుండి మారుస్తామంటే తాము ఒప్పుకోమని, రాజధానిని మార్చాలని తానెప్పుడూ చెప్పలేదన్నారు. గతంలో రైతులనుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే చెప్పామన్నారు. అమరావతి గ్రీన్‌ క్యాపిటల్ కట్టాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. గత ఐదేళ్లుగా పెట్టుబడులు పెట్టాక రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు.

 

అమరావతిలో రూ.7వేల కోట్లకుపైగా పెట్టబడులు పెట్టారని చెప్పారు. మంత్రి బొత్స సీఎంలా మాట్లాడుతున్నారని, కాపు రిజర్వేషన్లపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇస్తే బాగుంటుందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి ఉంటే బాగుండేది. పోలీసులు సైతం సంయమనంతో ఉండాలన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవుతున్నాయంటే పెట్టుబడులు రావడంలేదని అర్థమని, పోర్టులు, విమానాలు రద్దు చేసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, గత 10 నెలలుగా ఆలయాలకు నిధులు ఇవ్వడం లేదని, అర్చకుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం పవన్ విమర్శించారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat