ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబాలు సోమవారం కలుసుకున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ కుటుంబంతో కలిసి సీఎం కుటుంబం లంచ్ కు వెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన వేతనాలతో పాటు అనేక అంశాలపై గవర్నర్ తో జగన్ చర్చించారు. అలాగే గవర్నర్ సతీమణి ముఖ్యమంత్రి జగన్ సతీమణి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. గవర్నర్ జగన్ కలిసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సత్కరించిన సందర్భంలో గవర్నర్ జగన్ కు గుర్రం బొమ్మలు బహుకరించారు. పాలనలో గుర్రం మాదిరిగా వేగంగా దూసుకుపోవడం కోసం , వేగంగా స్పందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం తో గవర్నర్ సూచిక జగన్ కు ఈ బహుమతి అందించారట.
