గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో వంశీ మాట్లాడుతున్న సమయంలో ఆయన మాట్లాడటానికి వీల్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వంశీ అనర్హుడని చంద్రబాబు అన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన వంశీ తానకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్ చేస్తారా.? అంటూ చంద్రబాబును సభలోనే నిలదీశారు. తాను అనేక సందర్భాల్లో సీఎం జగన్ను కలిశానని, పోలవరం కాలువ సమస్యలపై ఆయనతో చర్చించానని వంశీ గుర్తు చేశారు. ఇళ్ల పట్టాలు, పోలవరం కుడి కాలువ రైతులు గురించి సీఎం జగన్ను కలిశాను.. గన్నవరం సమస్యలు చెప్పుకున్నాను. మానవతా దృక్పథంతో ఆయన సానుకూలంగా స్పందించారు. తరువాత నాపై చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు. సీఎం ఇంగ్లీష్ మీడియం పెట్టాన్ని స్వాగతించానని, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. ఇంగ్లీష్ మీడియంతో సమాజం బాగుపడుతుందన్నారు. అలాగే అమ్మఒడితో పేదపిల్లలకు మేలు జరుగుతుందన్నారు.. పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు. జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు విమర్శలు చేస్తున్నారన్నారు. గుడ్డెద్దు ముసిలి ఎద్దు నాపై విమర్శలు చేస్తున్నారని, నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు. నేను టీడీపీ సభ్యుడునే అని నాకు మాట్లాడే హక్కు లేదా.. అని ప్రశ్నించారు. కాగా టీడీపీ సభ్యులు వంశీని అడ్డుకోవడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ప్రతినిధిగా సభలో మాట్లాడే హక్కు వంశీకి ఉందని ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే హక్కు టీడీపీ సభ్యులకు లేదన్నారు.