వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. అసభ్యపదజాలంతో మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ..పోస్ట్లు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రకాశం జిల్లాకు చెందిన పునుగుపాటి రమేష్ పోలీసులకు దొరికిపోయాడు. అలాగే చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీపై అభ్యంతకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి అలియాస్ సత్యంరెడ్డిని, ఆ పోస్టులను షేర్ చేసిన పంతగాని ప్రవీణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కల్యాణదుర్గం వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్పై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీపై అభ్యంతకర పోస్టు పెట్టిన ఒంటారెడ్డిపల్లికి చెందిన కరణం తిప్పేస్వామి అనే టీడీపీ కార్యకర్తను, ఆ పోస్టును షేర్ చేసిన అంబరీష్ అనే మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిని సోమవారం కోర్టుకు హాజరుపర్చినట్లు కల్యాణదుర్గం సీఐ సురేష్బాబు తెలిపారు. అయితే మహిళా ఎమ్మెల్యేలను అసభ్యపదజాలంతో కించపర్చిన తమ టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బనాయించారని, వెంటనే వారికి బెయిల్ ఇవ్వాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు పోలీసులపై వత్తిడి చేశారు. అయితే పోలీసులు మాత్రం నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు న్యాయమూర్తుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో అధికారం కోల్పోవడంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు…అందుకే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య పోస్టులు పెడుతూ తమ శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారు. మొత్తంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో అసభ్యపోస్టులతో చెలరేగిపోతున్న టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
