ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటివద్దకే పెన్షన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. నేటి నుంచే వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టింది. పింఛన్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్ దారులకు డోర్ డెలివరీ విధానం ఎంతో ఆనందం కలిగిస్తోంది. తాము ఎప్పుడు ఉంటే అప్పుడే ఇంటికొచ్చి మాకు వలంటీర్లు పింఛన్లు ఇస్తుండడం సంతోషంగా ఉందని, దీని వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
