2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి పేరును బలవంతంగా రాష్ట్ర ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా రాజధాని పేరుతో వేల ఎకరాలు భూములు తీసుకుని అమరావతి సెంటిమెంట్ ను క్రియేట్ చేసి అమరావతి చుట్టుపక్కల తన బినామీలకు లబ్ధి చేకూరేలా చంద్రబాబు ప్రయత్నించారు ఇందుకోసం అనేక జిమ్మిక్కులు కూడా చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే సచివాలయం లోనూ అమరావతి అనే నినాదాన్ని ఉంచగా ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ లో భాగంగా మూడు రాజధానులు అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వం అమరావతిలోని సచివాలయంలో ఐ లవ్ అమరావతి స్థానం లో ఐ లవ్ ఏపీని ప్రతిబింబింపజేస్తుంది.
