ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దిశా యాప్ ఆపదలో ఉన్న మరో మహిళకు అండగా నిలిచింది. కృష్ణా జిల్లా కొల్లేటి కోటలో ఓ మహిళను ట్రాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి కిడ్నాప్ చేయాలని చూసాడు. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం రావడంతో ఆమె అప్రమత్తమైంది. మహిళ వెంటనే దిశ యాప్ తో పోలీసులను అలర్ట్ చేసింది.. ఎస్వోఎస్ ద్వారా సమాచారం పంపగా సమీపంలోని పీఎస్కు అలర్ట్ వెళ్లింది. ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మహిళను కాపాడారు. ఆటో డ్రైవర్ పెద్దిరాజును అరెస్ట్ చేసి దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళల రక్షణ కోసం జగన్ సర్కార్ దిశ చట్టాన్ని తీసుకొస్తూ ఈ యాప్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆపదలో మహిళలకు ఈ విధంగా ఉనయోగపడుతున్న యాప్ ను సర్వత్రా అభినందిస్తున్నారు.
