ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
