ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానలు జరగుతూనే ఉన్నాయి. గత వారంలోనే హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పోలీస్ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు కూడ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా కాకినాడలో భారత రాజ్యంగా నిర్మాత డా..బిఆర్ ఆంబేద్కర్ విగ్రహావిస్కరణకు హోం మంత్రి చినరాజప్పను ఆహ్వానించారు టీడీపీ నేతలు. దీంతో హోం మంత్రి చినరాజప్ప హజరయ్యి విగ్రహవిస్కరణ చేశాడు. కాని అక్కడ ఏర్పాటు చేసిన శిలాపలాకంలో నిమ్మకాయల చినరాజప్ప శాసన సభ్యురాలు కాకినాడ రూరల్ అని అందులో చెక్కించారు. అంటే చిన్నరాజప్ప శాసన సభ్యుడా…శాసన సభ్యురాల అనేదా కూడ తెలియాకుండా హోం మంత్రి చినరాజప్పను మరీ ఇంత దారుణంగా అవమానిస్తున్నారు టీడీపీ నేతలు..అని సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
