Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనికి బిగ్ షాక్‌..!

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనికి బిగ్ షాక్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ వ‌ద్ద చెప్పుకుంటున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ సామాన్య‌ల‌పై చేస్తున్న దాడుల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

SEE ALSO:

ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరులో పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పార్టీ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

SEE ALSO:

అయితే, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా దెందులూరులో అడుగుపెట్టిన రోజున టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ను మ‌ర‌ల్చేందుకు చాక్లెట్లు పంచిపెట్టిన విష‌యం తెలిసిందే. అలాగే, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సైతం పాద‌యాత్ర జ‌న సందోహంలో చిక్కుకుపోయారు. అంత‌లా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు పాల్గొన్నారు. దెందులూరులో వైసీపీ గెలుపుకు ఈ ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రో ప‌క్క చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై ఇప్ప‌టికే పోలీస్ స్టేష‌న్ల‌లో అనేక ఫిర్యాదులు, కేసులు ఉండ‌టం,.. ఇప్ప‌టికీ దెందులూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై ప్ర‌జ‌లు వ్య‌తిరేక భావ‌న‌ను చూపుతున‌న‌ట్టు ఆ స‌ర్వే వెల్ల‌డించింది.

SEE ALSO:

అలాగే, వైసీపీ త‌రుపున అబ్బ‌య్య చౌద‌రి నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటూ ప‌రిష్క‌రిస్తున్నారు. ఇలా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లం రోజు రోజుకు పెరుగుతోంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. దీన్నిబ‌ట్టి చూస్తే దెందులూరులో వైసీపీ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని రాజకీయ విశ్లేష‌కులు అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

SEE ALSO:

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat