Home / ANDHRAPRADESH / కోడెల కుమార్తె మరో కే ట్యాక్స్ బాగోతం బట్టబయలు..!

కోడెల కుమార్తె మరో కే ట్యాక్స్ బాగోతం బట్టబయలు..!

కోడెల ఫ్యామిలీ పాపం పండింది…గత ఐదేళ్లు చంద్రబాబు అండతో చెలరేగిపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఆయన కొడుకు శివరామకృఫ్ణ, కూతురు విజయలక్ష్మీ అవినీతి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కే ట్యాక్స్ దందా,, కేబుల్ ట్యాక్స్ స్కామ్, ల్యాండ్ మాఫియా, గడ్డి స్కామ్..అసెంబ్లీ ఫర్నీచర్ స్కామ్, ఆటో మొబైల్ షోరూంలో స్కామ్, ఇలా కోడెల ఫ్యామిలీ కుంభకోణాలకు అంతే లేదు. ఈ విషయం పక్కన పెడితే కోడెల కుటుంబానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే, ఇచ్చిన సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే కాళ్లావేళ్లా పడాల్సిందే.. వాళ్ల బెదిరింపులకు లొంగి ఉండాల్సిందే.. అలా కాదని ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో జైలుకు వెళతారు. లేదంటే భౌతిక దాడులకు గురవుతారు. ఇదంతా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో కోడెల కుటుంబం సాగించిన దందా.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బాధితుల ఫిర్యాదుతో జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబంపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి పరారయ్యారు. వారు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం సైతం బెయిల్‌ను నిరాకరించింది. దీంతో బాధితుల వద్ద నొక్కేసిన సొమ్మును వెనక్కి ఇచ్చి రాజీలు చేసుకుంటున్నారు. గతంలో ఓ సర్జికల్‌ వ్యాపారికి ఇవ్వాల్సిన నగదుకు ఎగనామం పెట్టిన కోడెల కుమార్తె విజయలక్ష్మీ తాజాగా ఆ వ్యాపారిని పిలిచి మరీ నగదు చెల్లించడం గమనార్హం.

.తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చల్లా రవీంద్రరెడ్డి ఆ గ్రామంలో వెంకటేశ్వర సర్జికల్‌ కాటన్‌ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సర్జికల్‌ కాటన్‌ను కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్‌ కంపెనీకి సరఫరా చేశారు. అందుకుగాను సుమారు రూ.15 లక్షలు రవీంద్రరెడ్డికి కోడెల కుమార్తె కంపెనీ నుంచి రావాల్సి ఉంది. నగదు కోసం పలుమార్లు ఆమెను కలిసి అడగ్గా బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు మూడు రోజుల క్రితం గుంటూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం సైతం కేట్యాక్స్‌ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తుండటంతో మరో దారి లేక ఆయనకు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి విజయలక్ష్మి సంతకం చేసిన రూ.14.40 లక్షల రూపాయల విలువైన రెండు చెక్కులను శుక్రవారం సేఫ్‌ కంపెనీ మేనేజర్‌ అందజేశారు. అక్రమాలు చేయటం, వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిదిద్దుకోవటంలో సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుది అందె వేసిన చేయిగా చెప్పుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ దొంగతనం బయట పడగానే.. తీసుకున్న ఫర్నిచర్‌కు డబ్బులు చెల్లిస్తానని బుకాయించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మీ కూడా నడిచారు. విజయలక్ష్మి వెంకటేశ్వర సర్జికల్‌ కాటన్‌ యజమాని రవీంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు ముట్టచెప్పి కేసు మాఫీకి యత్నించడం గమనార్హం. కేవలం జైలుకు పోతామన్న భయంతో కోడెల ఫ్యామిలీ ..ఇలా బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి, కేసుల విషయంలో రాజీకి ప్రయత్పిస్తున్నారే కానీ….ఒక్కసారి కోడుల ఫ్యామిలీకి డబ్బలు ఇస్తే…అంత ఈజీగా రావు అంటూ..సత్తెనపల్లి, నరసరావుపేటలలో చర్చ జరుగుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat