ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకేసారి 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఏపీ సీఎం జగన్ స్వయంగా సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పునస్కరించుకుని తూగోజిల్లాలోని కరప గ్రామంలో గ్రామసచివాలయ వ్యవస్థను ప్రారంభించి, స్వపరిపాలనలో నూతన శకానికి నాందిపలికారు. అయితే తాజాగా సచివాలయ పరీక్ష రాసిన అభ్యర్థులకు సీఎం జగన్ మరో వరాన్ని ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగ నియామకాల్లో క్వాలిఫై మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో క్వాలిఫై మార్కులను తగ్గించారు. దీంతో ఎస్పీ, ఎస్టీ కేటగిరిలో అర్హత సాధించలేకపోయిన మరికొంత మంది అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. వివరాల్లోకి వెళితే గ్రామ సచివాలయ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు గాను నిర్వహించిన రాత పరీక్షల్లో.. ఆయా కేటగిరీల అభ్యర్థులు కనీస మార్కులు తెచ్చుకోలేక పోయారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కాగా సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల్లో ఓసీలకు 60, బీసీలకు 52.50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హత మార్కులుగా నోటిఫికేషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల రాతపరీక్షల్లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారు తగినంత మంది లేక ఖాళీలు మిగిలిపోయాయి. దీంతో.. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల్లో పోస్టులవారీగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను తగ్గించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని సమాచారం పంపుతున్నారు. ఈ పోస్టులను ఈ నెల 14లోపు ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీలతో పాటు పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలు బీసీ.. జనరల్ కేటగిరీల్లో మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 15న జిల్లాల వారీగా జనరల్, బీసీ కేటగిరీల్లో మిగిలిపోయే పోస్టుల వివరాలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, జనరల్ కేటగిరిలో కూడా కటాఫ్ మార్కులు తగ్గిస్తే మరికొంత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా ఎస్సీ, ఎస్టీలతో పాటు, బీసీ, జనరల్ కేటగిరి అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కులు తగ్గించేందుకు సీఎం జగన్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు రాసి, అర్హత సాధించలేకపోయిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులలో మరి కొంతమందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
Tags andhrapradesh another benefit AP grama sachivalaya jobs cm jagan cut off marks decreasing exam candidates
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023