గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయి రెండు చోట్ల పక్క ప్రణాళికతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురుకి గాయలవ్వగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరోపక్క ఈడుపుగల్లుకు చెందిన మరో వైసీపీ కార్యకర్త షేక్ బాజీపై పదిమంది దాడి చేసారు. అమ్మవారి ఊరేగింపులో టీడీపీ కార్యకర్తల దాడికి గాయాలనినవారిని ఆసుపత్రికి తరలించగా..ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన మైనారిటీ దంపతులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరులు కక్షగట్టి మారీ వారిపై దాడికి పాల్పడ్డారు.