13 కోట్లు బ్యాంకు అప్పు చెల్లించకపోగా..పైగా నాకు ప్రభుత్వం నుంచి 3 కోట్లు డబ్బులు రావాలి.. అందుకే కట్టలేదంటూ దబాయిస్తున్న బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్టాపిక్గా మారింది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటీవల ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిన పత్రికలలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్లో భరత్ కుటుంబానికి చెందిన కంపెనీ రూ. 13 కోట్లు బకాయిలు పడినట్లుగా ఉంది. దీంతో ఆ కంపెనీకి సంబంధించి ఆంధ్రా బ్యాంక్ ఆస్తుల వేలం ప్రకటించింది. ఈ విషయంపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. నారా చంద్రబాబునాయుడి దొంగల ముఠా, ఆయన బీజేపీకి లోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారంటూ..విజయసాయిరెడ్డి సెటైరికల్గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై బాలయ్య అల్లుడు భరత్ కూడా రియాక్ట్ అయ్యాడు. విజయసాయి రెడ్డి గారు… మీ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాను. ఏపి ట్రాన్స్ కో నుండి Vbc రెన్యూబుల్ ఎనర్జీ , మా సంస్ధకు రావలసిన బకాయిలు దాదాపు రూ.3కోట్లు, ట్రాన్స్ కో సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే వాయిదాలు సమయానికి చెల్లించేవాళ్ళం. కానీ ఆర్దిక ఇబ్బందులు కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం అంటూ భరత్ వరుసగా రీట్వీట్లు చేశాడు. అయితే భరత్ చెప్పిన లెక్కల ప్రకారం ఆంధ్రా బ్యాంకు దగ్గర తీసుకున్న అప్పు 15 కోట్లు అయితే 2 కోట్లు తీర్చారు. ఇంకా 13 కోట్ల బ్యాంకు అప్పు మిగిలి ఉంది. వ్యాపారంలో నష్టాలు వచ్చినా, బ్యాంకు అప్పులు మాత్రం తీర్చాల్సిందే. అయితే ప్రభుత్వం దగ్గర 3 కోట్లు రావల్సి ఉన్నాయని చెప్పి 13 కోట్ల అప్పు తీర్చకుండా ఎగ్గొట్టడం ఏందని బ్యాంకు అధికారులు అంటున్నారు. అయినా వందల కోట్ల అధిపతి అయి ఉండి..ఇలా ప్రభుత్వం దగ్గర 3 కోట్లు ఆగిపోయాయని చెప్పి… బ్యాంకు అప్పు తీర్చకుండా దబాయిస్తున్న భరత్ను చూసి అందరూ నోరెళ్లపెడుతున్నారు. కొంపదీసి తప్పు చేసి, పైగా ఎదుటోళ్లనే బుకాయించే బాబుగారి బుద్ధులే భరత్ కూడా అలవాటు చేసుకున్నాడా ఏంటీ అని వైజాగ్ ప్రజలు విస్తుపోతున్నారు.
నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. @ncbn దొంగల ముఠా, ఆయన @BJP4India లోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2019