ఏపీ ప్రతిపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు విచారణ నుంచి ఆరు నెలల మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోయినా, ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కోర్టు తీర్పునకు లోబడే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.ఎవరుఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వైఎస్ జగన్ను చూస్తే టీడీపీకి భయమేందుకో అర్థం కావడం లేదన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్ తమ నేతలతో చర్చించి త్వరలోనే పాదయాత్ర రూట్ మ్యాప్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ ప్రజల్లోనే ఉంటారని, ఆయనను ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ అందరినీ కలుస్తారని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారని వాసిరెడ్డి పద్మ వివరించారు. వ్యక్తిగత హాజరు నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం ఇవ్వలేమన్న కోర్టు.. ప్రతివారం బదులుగా నెలకోసారి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతే చాలని సూచించిందని సమాచారం.
