Home / ANDHRAPRADESH / మంత్రి కొల్లు ర‌వీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!!

మంత్రి కొల్లు ర‌వీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!!

కొండ‌ను త‌వ్విన కొద్దీ రాళ్లు బ‌య‌ట‌డ్డాయ‌న్న చందాన ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్మిస్తున్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లోనూ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ భారీ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవ‌ల సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేర‌స్థుడు, టీటీడీ మాజీ స‌భ్యుడు శేఖ‌ర్‌రెడ్డికి సంబంధాలున్నాయ‌ని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా వ‌ద్ద ఉన్నాయంటూ బ‌హిరంగంగా చెప్పారు కూడాను. చంద్ర‌బాబు అవినీతి అంత‌టితో ఆగ‌లేదు.. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల పేరుతో బాగానే సొమ్మును వెన‌కేసుకున్నారంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. చంద్ర‌బాబు అవినీతిలో అత‌ని మంత్రివ‌ర్గానికి కూడా వాటా ఉంద‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌.

see also : మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!

అయితే, ఈ మాట‌ల‌నే రుజువు చేస్తూ సీఎం చంద్ర‌బాబు కేబినేట్‌కు చెందిన మంత్రి కొల్లు ర‌వీంద్ర రూ.800 కోట్లు అవినీతికి పాల్ప‌డ్డారు. ఈ అవినీతి భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది ఎవ‌రో కాదండి బాబూ… స్వ‌యాన మంత్రి కొల్లు ర‌వీంద్ర ఎమ్మెల్యేగా గెలిచిన మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే. కాగా, గ‌తంలో మంచిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు అయ్యాయ‌ని స్వ‌యాన మంత్రి కొల్లు ర‌వీంద్రే మీడియా ముఖంగా చెప్పార‌ని, ఆ డ‌బ్బంతా ఇప్పుడు ఎక్క‌డికి పోయింద‌న్న‌ది మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అంటున్న మాట‌. నిజ‌మే మ‌రీ వారంటున్న మాట‌ నిజ‌మే..!! ఒక వేళ ఆ రూ.800 కోట్లు ఖ‌ర్చుపెట్టి ఉంటే ఇప్ప‌టికే మ‌చిలీప‌ట్నంలో అభివృద్ధి క‌నిపించాలి క‌దా..? ప్ర‌తీ వీధిలోనూ మురుగునీరు పారేందుకు డ్రైనేజీ కాల్వ‌లు ఉండాలి క‌దా..? మ‌చిలీప‌ట్నం పోర్టు ఇప్ప‌టికే వ‌చ్చి ఉండాలి క‌దా..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు మ‌చిలీప‌ట్నం ప్ర‌జ‌లు. మ‌చిలీప‌ట్నం అభివృద్ధికి రూ.800 కోట్లు వ‌చ్చిన‌ట్టు చెబుతున్న మంత్రి కొల్లు ర‌వీంద్ర ఆ నిధుల‌న్నీ ఏం చేశారు..? మా ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పాలి అంటూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను నిల‌దీస్తున్నారు.

see also : షూటింగ్‌ లో హీరోయిన్‌ స్నానం చేస్తుంటే ..నిర్మాత వీడియో..యూట్యూబ్‌లో హల్ చల్

అంతేకాకుండా, 2014 ఎన్నిక‌ల్లో న‌న్ను గెలిపిస్తే సంవ‌త్స‌రం తిర‌గ‌కుండానే మ‌చిలీప‌ట్నం పోర్టు తీసుకువ‌స్తాన‌ని హామీ ఇచ్చి.. ఎమ్మెల్యేగా గెలిచి అనంత‌రం మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ పోర్టు తీసుకురాక‌పోవ‌డం ఓట‌ర్ల‌ను మోసం చేయ‌డ‌మేనంటున్నారు ప్రజ‌లు. పోర్టు నిర్మాణానికి 12 వేల ఎక‌రాల భూమి స‌రిపోతుంద‌ని చెప్పిన మంత్రి, కాదు.. కాదు 30వేల ఎక‌రాలు అవ‌స‌ర‌మంటూ ప్ర‌జ‌ల నుంచి భూ సేక‌ర‌ణ చేయ‌డం ప్రారంభించారు. ఇలా మంత్రి కొల్లు ర‌వీంద్ర తన అధికార బ‌లంతో అటు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల‌ను స్వాహా చేయ‌డంతోపాటు ఇటు పోర్టు నిర్మాణం పేరిట భూదందా చేస్తున్నారని మ‌చిలీప‌ట్నం ప్ర‌జ‌లు వాపోతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat