ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై అటు సీనియర్ రాజకీయ నాయకులతోపాటు.. ఇటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా.. ఇటీవల హీరో నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ సినిమా ప్రమోషన్లో భాగంగా వైఎస్ జగన్పై ప్రశంజల వర్షం కురిపించగా.. ఆ జాబితాలో ఇప్పుడు స్టార్ హీరో సూర్య కూడా చేరిపోయారు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగిన యాంకర్కు హీరో సూర్య సమాధానమిస్తూ.. వైఎస్ జగన్ అంటే రాజకీయంగా నాకు అభిమానం. ఆయన చేస్తున్న పాదయాత్ర సూపర్బ్ అంటూ తన దైన శైలిలో చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రతీ ఊరికి ఓపిగ్గా వెళ్లి, ప్రతీ ఒక్కరిని కలిసి మాట్లాడటం గొప్ప విషయమన్నారు. ఎవరైనా రెండు రోజులు నడిస్తేనే అలిసిపోతారు… అటువంటిది వైఎస్ జగన్ ప్రజల కోసం వందల రోజులు… వేలకొద్ది కిలోమీటర్లు నడుస్తుండటం గొప్ప విషయమని చెప్పారు స్టార్ హీరో సూర్య.
ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్పై ఇటీవల కాలంలో టాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు, అలాగే, అక్కినేని హీరో సుమన్, అక్కినేని నాగార్జున ఇలా ఒక్కొక్కరుగా వైఎస్ జగన్పై ఉన్న తమ అభిమానాన్ని మీడియా ముఖంగా చెబుతున్నారు.
గతంలో హీరో సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నానని, జగన్ అనుకున్న లక్ష్యం నెరవేరాలంటూ, త్వరలో తాను కూడా ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనబోతున్నానంటూ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.