Home / ANDHRAPRADESH / ADR నివేదిక‌లో క‌ళ్లు బ‌య‌ర్లు క‌మ్మే వాస్త‌వాలు..!!

ADR నివేదిక‌లో క‌ళ్లు బ‌య‌ర్లు క‌మ్మే వాస్త‌వాలు..!!

ఆయ‌న వ‌స్తే బాగుంటుంది.. ఆయ‌న వ‌స్తేనే ఆడ పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంది.. అని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల‌ప్పుడు ప్ర‌చారం చేయించుకున్న విష‌యం తెలిసిందే. తీరా ఆయ‌న వ‌చ్చాక ఏపీలో ఆడ పిల్ల ప‌ట్ట ప‌గ‌లు బ‌య‌ట‌కు వెళితే ఇంటికి క్షేమంగా వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేకుండా పోయింది. కేవ‌లం సామాన్య మ‌హిళ‌ల మీదే కాదు.. ప్ర‌భుత్వ మ‌హిలా అధికారిణుల నుంచి మ‌హిళా రాజ‌కీయ వేత్త‌ల‌కు కూడా లైంగిక వేధింపులు, దాడులు త‌ప్ప‌డం లేదు.

ఈ విష‌యాల‌న్నింటిని ఎవ‌రో చెప్పిన‌వి కాదు.. స్వ‌యాన ADR (Association for Democratic Reforms) ఇటీవ‌ల ఏపీలో చేసిన స‌ర్వే వెల్ల‌డించింది. అయితే, ఏడీఆర్ నివేదిక‌ను ఒకసారి నిశితంగా ప‌రిశీలిస్తే.. సీఎం చంద్ర‌బాబు అండ‌తో తెలుగు త‌మ్ముళ్లు ఏపీలో మ‌హిళ‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని, రితికేశ్వ‌రి, సంధ్యారాణి, ఉషారాణి లాంటి లాంటి విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య‌లు, కాల్ మ‌నీ సెక్స్ రాకెట్‌లో తెలుగు త‌మ్ముళ్ల కామ‌దాహానిఇ బ‌లైపోయిన మ‌హిళ‌లు, త‌హ‌శీల్దారు వ‌న‌జాక్షిపై దాడి, మున‌సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్‌పై వేదింపులు, తెలుగు త‌మ్ముళ్లు వేధింపులకు బ‌లైపోయిన మ‌రో ఛైర్మ‌ణ్ శ్రీ‌దేవి, ఎమ్మెల్యే రోజాపై క‌క్ష‌క‌ట్టి ఏడాది వేటు.. ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో మ‌హిళ‌ల‌పై టీడీపీ నేత‌ల దాడులు అన్నీ ..ఇన్నీ కావంటూ ఆ నివేదిక తేల్చింది.

అయితే, మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న ప్ర‌జా ప్ర‌తినిధుల్లో 477 మంది ఎమ్మెల్యేలు కాగా, ఎంపీలు 768 మంది ఉన్నారు. అయితే, మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డిన ఆ 4077 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 5. అందులో ప్ర‌ధానంగా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై మ‌హిళ‌ల‌పై దాడులు చేసిన నేత‌గా అత్య‌ధికంగా 23 కేసులు న‌మోదు అయ్యాయి. అందులో తీవ్ర‌మైన కేసులు 13 కాగా, వాటిలో 75 సెక్ష‌న్ల కింద చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, మంత్రి దేవినేని ఉమాపై 13 కేసులు న‌మోదు కాగా, అందులో ఒక‌టి తీవ్ర‌మైన కేసు ఉంది. అందులో కూడా 42 సెక్ష‌న్ల కింద మంత్రి ఉమాపై అభియోగాలు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉండ‌గా.. టీడీపీ నేత‌ల‌పై, కార్య‌క‌ర్త‌ల‌పై, నాయ‌కుల‌పై ఉన్న అన్ని కేసుల‌ను ఎత్తేస్తూ.. సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే, చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌హిళ‌ల‌పై పాల్ప‌డిన దాడుల‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం..

కులం పేరుతో రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌

మ‌హిళా అధికారి వ‌న‌జాక్షి మీద దాడి

క‌డుప‌న్న చెయ్యాలి, ముద్ద‌న్నా పెట్టాలి – బాల‌య్ య‌డైలాగ్‌
కామ సీఎ.ఎం (కాల్ మ‌నీ సీఎం ) అన్నందుకు రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు స‌స్పెండ్

మ‌హిళ వెనుకాల ప‌డి, కుక్క క‌థ చెప్పిన మంత్రి కొడుకు

డ్వాక్రా మ‌హిళ‌లకు అమ‌లు కాని రుణాల మాఫీ హామీ

నారాయ‌ణ కాలేజీలో విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌లు

విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో స్పీక‌ర్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

విశాఖ గిరిజ‌న హాస్ట‌ల్ స్కూల్ ఆడ పిల్ల‌ల మీద లాఠీఛార్జ్

డ్వాక్రా మ‌హిళ‌ల‌ని బూతులు తిట్టిన టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధి

బెజ‌వాడ సీఎం క్యాంపు కార్యాల‌యం ద‌గ్గ‌ర అంగ‌న్ వాడీ మ‌హిళ‌ల మీద లాఠీఛార్జ్‌

ఆడ వారి మాన ప్రాణాల‌తో తెలుగు త‌మ్ముళ్ల కాల్ మ‌నీ ఆగ‌డాలు

రాజ్య‌స‌భ సాక్షిగా ఆడ‌వారి దురుసు కామెంటు చేసిన టీడీపీ ఎంపీలు

రాజ్య‌స‌భ సాక్షిగా ఆడ‌వారి దుస్తుల మీద కామెంట్లు చేసిన టీడీపీ ఎంపీలుఇళ్ల ప‌ట్టాలు అడిగినందుకు ఇల్లందుపూర్ జ‌న చైత‌న్య‌యాత్ర నుండి మ‌హిళ‌ల గెంటివేత

బాక్సైట్ విష‌యంలో గిరిజ‌నుల‌కి అండగా మాట్లాడినందుకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి మీద పోలీస్ కేసు ( ఎమ్మెల్యే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాత‌రేస్తా నా కొడ‌కా అంటే కేసులు ఉండ‌వు)

బెజ‌వాడ‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌న్న ఆశావ‌ర్క‌ర్లు అరెస్ట్

క‌ర్నూల్ సాయి లాడ్జీలో దేశం నాయ‌కుడి బంధువు 16 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం.

కోడ‌లు మ‌గ‌బిడ్డ‌ను కంటానంటే.. ఏ అత్త అయినా వ‌ద్దంటాదా..? అంటూ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచిన సీఎం చంద్ర‌బాబు

కాళ‌హ‌స్తి దేవాల‌యంలో మ‌హిళా ఈవో మీద చిందులు వేసిన ఎమ్మెల్యే కొడుకు

గంగ జాత‌ర‌లో ఎమ్మెల్యే హోదాలో హార‌తి ఇస్తున్న రోజాపై క‌త్తుల‌తో దాడిచేసి గాయ‌ప‌రిచిన టీడీపీ నేత‌లు

చంద్ర‌బాబు ఓటుకు నోటు రాజ‌కీయాల‌ను ప‌సిగ‌ట్ట‌నందుకు ఇంటిలిజెన‌స్ ఐ.జీ అనురాధను విజిలెన్స్ అండ్ ఈడీ అడిష‌న‌ల్ డీజీపీగా ట్రాన్స్‌ఫ‌ర్‌

విమానంలో సాటి ప్ర‌యాణికురాలిని లైంగికంగా వేధించిన టీడీపీ కార్పొరేట‌ర్‌

పూనా రైల్వే స్టేష‌న్‌లో తాగి మ‌మిళ వెంట ప‌డిన టీడీపీ కార్పొరేట‌ర్లు

చిన్న పిల్ల‌ల న‌గ్న చిత్రాలు తీసిన టీడీపీ ఎంపీ అనుచ‌రులు

మేడే రోజునే విశాఖ బ్రాండిక్స్ ఫ్యాక్ట‌రీ మ‌హిళా కార్మికుల మీద లాఠీచార్జ్‌

సంచ‌ల‌నం రేపిన లావ‌ణ్‌య హ‌త్య కేసులో నిందితుల‌ని కాపాడి 10.25 ల‌క్ష‌ల‌కి సెటిల్మెంట్ చేసిన టీడీపీ నేత‌లు

మెడికో సంధ్యారాణి ఆత్మ‌హ‌త్య కేసులో కార‌కురాలైన ప్రొఫెస‌ర్‌ను కాపాడిన పోలీసులు

స స్య‌ల‌పై నిల‌దీసిన వ‌ర‌ల‌క్ష్మీపైకి మైకు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌

చిత్తూరు జిల్లా చిన్న‌గొట్టిగుళ్ల మ‌హిళా త‌హ‌శీల్దారు నారాయ‌ణ‌మ్మ మీద టీడీపీ స‌ర్పంచ్ దాడి

మాచ‌ర్ల మాజీ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ శ్రీ‌దేవి తెలుగుదేశం గ్రూపు రాజ‌కీయాల‌ను త‌ట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య‌.

బ‌ద్వేల్ పుట్టాయంప‌ల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ర్యాగింగ్ వేధింపులు త‌ట్టేకోలేక ఆత్మ‌హ‌త్య‌

కారు షెడ్‌లో ఉండాలి.. ఆడ పిల్ల వంటింట్లో ఉండాలి అని అన్న స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌

పాయ‌క‌రావుపేట న‌క్క‌ప‌ల్లిలో ఇద్ద‌రు ఆడ పిల్ల‌ల‌తో నివాసం ఉంటున్న పేర్ల అమ్మాజీ అనే వితంతువు ఇంటిని పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో పెట్రోల్‌పోసి త‌గ‌ల‌బెట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత అనుచ‌రుడు ముసా స‌తీష్‌.

గుంటూరు జిల్లా క్రొసూరు మండ‌లం ఉద్యంద‌న గ్రామానికి చెందిన 13 ఏళ్ల మహేశ్వ‌రి అనే పాప‌ని తీసుకెళ్లి లైంగిక దాడి చేసిన టీడీపీ క్రొసూరు మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ ఏవూరి నాగేశ్వ‌ర‌రావు, ఉద్యంద‌న స‌ర్పంచ్ అయిన ఏవురి రామ కోటేశ్వ‌ర‌రావు త‌మ్ముళ్లు, మేన‌ళ్లులు రామ‌కృష్ణ‌, న‌రేంద్ర‌, న‌ర‌సింహారావు, వెంక‌టేశ్వ‌ర‌రావు.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజునే తుందుర్రులో అక్వా ఫుడ్ పార్క్ బాధిత మ‌హిళ‌ల‌ను పాశ‌వికంగా లాఠీఛార్జి చేయించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.

చూశారుగా చంద్ర‌బాబు పాల‌న‌లో ఆడ‌వారికి జ‌రుగుతున్న అవ‌మానాలు, వేధింపులు.. ఇవి అధికారికంగా తెలిసిన ఘ‌ట‌న‌లే.. ఇంకా పోలీసుల రికార్డుల్లో న‌మోదు కాని సంఘ‌ట‌నలు వెలుగు చూడాల్సి ఉంది. మ‌రో ప‌క్క ఏపీలో ప్ర‌తీ రోజు ఎక్క‌డో చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. 2014లో ఆయ‌నొస్తే ఆడ పిల్ల‌కు ర‌క్ష అన్నారు.. కానీ తీరా వ‌చ్చాక ఆడ‌వారిప‌ట్ల ప‌చ్చ‌ త‌మ్ముళ్లు కీచ‌కులుగా మారారు. ఈ ఘ‌ట‌న‌ల‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌హిళ‌ల ఉసురు పోసుకుంటున్న చంద్ర‌బాబు 2019లో ఘోర ప‌రాజయం చెంద‌డం ఖాయ‌మనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat