తెలుగుదేశం పార్టీ దారుణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి…. కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.జిల్లాలో రక్తపు ప్లేట్లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి,యూనిట్ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పారు . వైద్య, ఆరోగ్యశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు ఉంటున్న చోటే ఇలా జరిగితే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి అని ప్రశ్నించారు.‘రక్తంతో వ్యాపారం ఇక్కడ ఒక వృతి, ఎక్కడున్నారు ముఖ్యమంత్రిగారు? మీ ప్రభుత్వం డెంగీ విజృంభణను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘2019 ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిన తరువాత లోకేశ్ తమ పార్టీ అమెరికాలో అధికారంలోకి ఎలా రావాలో ఆలోచిస్తూ ఉంటారు. మరి చంద్రబాబు ఏ దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటారు? అని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
