ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైసీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద డిసెంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హజరుకానున్నారు. కాగా విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఉద్యమసెగ దేశ రాజధానికి తాకాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
