Home / ANDHRAPRADESH / రాజధాని విషయంలో సీఎం జగన్ తీరుపై ప్రజలేమనుకుంటున్నారు…?

రాజధాని విషయంలో సీఎం జగన్ తీరుపై ప్రజలేమనుకుంటున్నారు…?

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన సర్వేలన్నీ వందకు వంద శాతం నిజమయ్యాయి. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెల్చుకుంటుందని ప్రకటించిన దరువు సర్వే నిజమైంది. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు గెల్చుకుంటుందని దరువు సర్వే ఫలితాలను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెల్చుకుని చరిత్ర తిరగరాసింది. ఇక 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే…దరువు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పింది దరువు. సర్వేల్లో ప్రజలనాడీ పట్టుకోవడంలో దరువుది అందె వేసిన చేయి. ప్రామాణికత, కచ్చితత్వం, పారదర్శకత పాటించడం మా దరువుకే సొంతం.

వైయస్ జగన్ 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు సమగ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రాజధాని అంశంపై జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. రాజధాని విషయంపై ముఖ్యంగా 67 % మంది సంతోషం వ్యక్తం చేయగా 30 % మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక

3 % మంది ఈ విషయంపై ఏం చెప్పలేం అన్నారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో సాగించిన అవినీతి, అక్రమాలు ఇప్పుడు జగన్ హయాంలో బయటపడతాయని, బాధిత రైతులకు న్యాయం జరుగుతుందని మెజారిటీ శాతం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రులు కలలు కన్న రాజధాని అమరావతి నిర్మాణం జగన్ హయాంలో కొంత మేర స్పీడు తగ్గుతుందనే అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. మొత్తంగా రాజధాని విషయంలో సీఎం జగన్‌ తీరుపై మెజారిటీ శాతం సంతృప్తిగా ఉన్నారు. అనవసరం ఆడంబరాలకు పోకుండా ఆంధ‌్రుల రాజధాని విషయంలో జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళతారని ప్రజలు భావిస్తున్నారు. మొత్తానికి రాజధాని విషయంలో సీఎం జగన్ తీరుపై మెజారిటీ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat