తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. మొన్న తిరుమలలో బస్ టికెట్లపై అన్య మత ప్రచారం అంటూ టీడీపీ బ్యాచ్ విషం కక్కింది. అయితే ఆ టికెట్లు బాబు హయాంలోనే ప్రింట్ అయ్యాయని, లోకేష్ ఆదేశాల మేరకే టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు ఆర్టీసీ అధికారులు కావాలనే ఆ టికెట్లను నెల్లూరు నుంచి తిరుమలకు పంపిన విషయం బట్టబయలు కావడంతో టీడీపీ బ్యాచ్ గొంతుల్లో వెలక్కాయ పడినట్లు అయింది. అయినా పదేపదే తిరుమల తిరుపతి ప్రతిష్ట మంట గలిపేలా టీడీపీ దుష్ర్పచారం చేస్తూనే ఉంది. తాజాగా తిరుమల కొండపై చర్చి ఉందంటూ…ఇదిగో ఆ చర్చి ఫోటో అంటూ టీడీపీ పెయిడ్ బ్యాచ్ ప్రచారం మొదలెట్టింది. ఈ ఫోటోను కాస్త జూమ్ చేసి గమనిస్తే బ్లూ అండ్ గ్రీన్ ట్రయాంగిల్లో బోర్డులు కనిపిస్తాయి. అటవీ శాఖ కార్యాలయం చెందిన ఏ భవనంపై అయినా, అడవి దగ్గర ఏ బోర్డ్ అయినా బ్లూ అండ్ గ్రీన్ కలర్లో బోర్డులు కనిపిస్తాయి. నిజానికి ఆ ఫోటోలో ఉన్నది చర్చి కాదు.. అది ఫారెస్ట్ గార్డులకోసం నిర్మించిన రెస్ట్ రూమ్. ఆ రూమ్ పైన టీడీపీ పెయిడ్ బ్యాచ్చే సిలువగా చూపెడుతుంది…ఒక సోలార్ ప్యానల్. ఆ ఫోటోను మీరు జూమ్ చేసి చూస్తే అది చర్చి కాదని ఫారెస్ట్ గార్డుల రూమ్ అని అర్థమవుతుంది..చూశారుగా లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఎంతగా తిరుమల పవిత్ర దెబ్బతినేలా ఎలా నీచంగా ప్రచారం చేస్తుందో..ఒక ఫారెస్ట్ గార్డుల రూమ్ను పట్టుకుని చర్చిగా చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా… తద్వారా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందనేలా ఎంతగా విష ప్రచారం చేస్తుందో చూశారుగా…. ఏపీ ప్రజలు, ముఖ్యంగా శ్రీవారి భక్తులు తిరుమల పవిత్రత దెబ్బతినేలా టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఇది బాబు, లోకేష్లు మత విద్వేషాలు రగిలించేలా నడుపుతున్న నీచ రాజకీయం.
