Home / ANDHRAPRADESH / వన మహోత్సవాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్…!

వన మహోత్సవాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్…!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70 వ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా…అడవుల పెంనకమే లక్ష్యంగా చేపట్టిన ఈ వన మహోత్సవ కార్యక్రమం లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని వారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.ఈ వన మహోత్సవంలో అటవీ శాఖతో పాలు విద్యార్థులు, పలు స్వచ్చంధ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat