టీడీపీ కార్యకర్తలపై వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసింది. గత కొద్ది రోజులుగా వైసీపీ బాధిత పునవారాస కేంద్రాలు అంటూ మీటింగ్లు పెట్టి…కార్యకర్తలతో జగన్ సర్కార్పై తిట్టిస్తూ తాను..తిడుతూ..నానా యాగీ చేస్తున్నాడు చంద్రబాబు. తాజాగా సెప్టెంబర్ 11న ఛలో ఆత్మకూరు అంటూ పిలుపునిచ్చి పల్నాడులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే చంద్రబాబు కుట్రలపై సొంత పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ పుసరావాస కేంద్రానికి టీడీపీ కార్యకర్తలను తరలించేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. అయితే తమను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నాడని గ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఆ పునరావాస కేంద్రం నుండి సొంత ఊళ్లకు వెళుతున్నారు. పోలీసులు కూడా శాంతి భద్రతలకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు తమ స్వగ్రామాలకు వెళుతున్నారు. ఇప్పటికే టీడీపీ పునరావాస కేంద్రం నుండి 14 కుటుంబాలు ఆత్మకూరుకు చేరుకున్నాయి. మరో 24 మంది కార్యకర్తలు పిన్నెళ్లి గ్రామానికి వెళ్లిపోయారు. అయితే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతారంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేయడంతో భయంతో టీడీపీ కార్యకర్తలు పునరావాస కేంద్రానికి వెళ్లినట్లు చెబుతున్నారు. వైసీపీ నాయకులు కూడా పోలీసుల సమక్షంలో దాడులు చేయమని చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు అపోహలు వీడి తిరిగి తమ ఊళ్లకు వెళుతున్నారు. టీడీపీ కార్యకర్తలు పునరావాస కేంద్రం నుండి వెళ్లిపోతుండడంతో బాబులో ఆందోళన మొదలైంది. వాళ్లను ఎలాగైనా ఇళ్లకు పోకుండా చూడమని స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న మరికొందరు కార్యకర్తలను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే తమను అడ్డం పెట్టుకుని నీచరాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుపై పల్నాడు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేపు ఛలో అత్మకూరు కార్యక్రమం ఎక్కడ అభాసు పాలవుతుందో అంటూ టీడీపీ నేతలు తలపట్టుకున్నారు.
