ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. ఏపీ గవర్నమెంట్ తమ ఉద్యోగుల పదోన్నతి నిబంధనల్లో ఊహించని సడలింపు ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే ఇకనుంచి కనీస సర్వీసు కేవలం రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులతో పాటు జీవోఎంఎస్ నంబర్ 175 ను జారీ చేశారు.
ఇంతకుముందు జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21 నుంచి 2014 మే30 వరకూ ఐదేళ్ల కనీస సర్వీసు జీవో.నెం.230 ప్రకారం 2014మే31 నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కనీస సర్వీసు ఉంటేనే ప్రమోషన్ ఇస్తున్నారు. అయితే నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఎదురవుతున్న పాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పదోన్నతి నిబంధనల్లో సడలింపు చేయాలని అందుకే ఈ గడువును రెండేళ్లకు తగ్గించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విడిగా అడ్హాక్ రూల్స్ ను జారీచేసింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు.