Home / 18+ / పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు, జల విద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్‌ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా భయంతో వణికిపోతున్నారని అనిల్ విమర్శించారు. తాము దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతోనే రకరకాలుగా మాట్లాడుతున్నారని అనిల్‌ విమర్శించారు. మొత్తం 12.6శాతం తక్కువ సొమ్ముతో పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొస్తే జీర్ణించుకోలేక టీడీపీనేతలు అసత్యారోపణలు చేస్తున్నారని అనిల్ ఆగ్రహించారు.

 

మాజీ సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలంతా కమీషన్ల కోసమే పని చేసారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులోరివర్స్‌ టెండరింగ్‌ అనేది ఓ గొప్ప నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలంతా మెచ్చుకోవాలి కానీ అర్థం లేకుండా విమర్శలకు దిగుతున్నారు. పోలవరాన్ని తాము చెప్పిన సమయానికే పూర్తిచేస్తే టీడీపీని మూసే​స్తారా.? అంటూ ప్రశ్నించారు. పోలవరంతో పాటుగా వెలిగొండ ప్రాజెక్టులపై కూడా రివర్స్‌ టెండరింగ్‌కు వెళతామని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన ఖండించారు. దీనిని ప్రజలు నమ్మరు. అధిక ధరలకు టెండరింగ్‌ వేస్తే కట్టబెట్టినట్లా లేక తక్కువ ధరలకు టెండరింగ్‌ వేసి డబ్బు ఆదా చేస్తే కట్టబెట్టినట్లా.? అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ. 780 కోట్లు ఆదా అవగా ఇంకా ఆదా అవుతుంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ నిర్ణయానికి తాము గర్వపడుతున్నామని అనిల్‌ అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat