పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ఆర్ 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్, పేర్ని నాని స్థల పరిశీలన చేసారు. వీరుతో పాటు ప్రభుత్వ విప్ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గున్నారు.త్వరలోనే వైయస్ఆర్ స్మృతి వనం, పార్కు ఏర్పాటు చేస్తామని నాని అన్నారు.45 అడుగుల వైయస్ఆర్ విగ్రహంతో పాటు, డాక్టర్ కెయల్ రావు గారి విగ్రహం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. పులిచింతల ప్రాజెక్ట్ ను పర్యాటకప్రాంతంగా అభివృద్దిచేస్తామని, రోడ్లు, భవనాలతోపాటు నాలుగు కిలోమీటర్ల దిగువన గుంటూరు,కిృష్ణాలను కలుపుతూ వారధి ఏర్పాటును పరిశీలిస్తాం అనీల్ కుమార్ యాదవ్ అన్నారు.ముఖ్యమంత్రి జగన్ గారి ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ వద్ద స్థల పరిశీలన చేశామని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ కట్టిన తరువాత మొట్ట మొదటిగా పూర్తిస్తాయిలో నీటి నిల్వ చేయడం శుభపరిణామం.మరో ఇరవైఏళ్ళ పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో వుంటుందని,జగన్ ముఖ్యమంత్రిగా వుంటారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
