ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నవంబర్ 4 న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్మార్చ్కు పిలుపునిచ్చాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్పై వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కల్యాణ్ చేసేది లాంగ్ మార్చ్ కాదని..రాంగ్ మార్చ్ అని మండిపడ్డారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్, చంద్రబాబులను తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడ్డారని, బాబు ఏం చెబితే పవన్ అది చేస్తున్నారని అవంతి ఆరోపించారు. ఎన్నికలకు ముందు తెరవెనుక రాజకీయాలు చేసిన బాబు, పవన్లు ఇప్పడు బహిరంగంగా కలిసి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే స్పందించని పవన్.. ఇప్పుడు రోడ్డెక్కడం ఎందుకని అవంతి సూటిగా ప్రశ్నించారు. ఇక బాబుగారి పుత్రరత్నం లోకేష్ రాజకీయాలకు పనికిరాడని, పవన్కు కేడర్ లేదని విమర్శించారు. తన కొడుకు రాజకీయాలకు పనికిరాడని అర్థం కాబట్టే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్చుట్టూ తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. దీనిబదులు చంద్రబాబు పవన్ను టీడీపీ అధ్యక్షుడిగా చేయడం బెటర్ అంటూ..మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అవును..నోట్లో నాలుక లేని చినబాబుతో లాభం లేదు…బాబుగారికేమో వయసైపోతుంది..ఇక కొద్దొ గొప్పో నోరు ఉన్న పవన్ కల్యాణ్ను దత్తత తీసుకుని, పార్టీని అప్పగించేయడమే మంచిది..అంతకంటే ఆప్షన్ లేదంటూ..తెలుగు తమ్ముళ్లు జోక్లు వేసుకుంటున్నారు. మొత్తంగా బాబు, పవన్ కల్యాణ్ల ఇసుక రాజకీయాలకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.
