ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వాటిలో ముఖ్యాంశాలు ఇవే..!
*5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి వర్తింప జేస్తూ ఆదేశాలు
*అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులుగా తెలిపిన ప్రభుత్వం
*వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు ,జగన్నన్న విద్యా ,వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా తెలిపిన ప్రభుత్వం.
ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.
*12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి, 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు
*తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు
*వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్న కుటుంబాలకు అర్హులు
*5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
*3000 SFT (334 చదరపు Yds) కన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు
*5 లక్షలోపు వా ర్షిక ఆదాయం ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
*ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు
*కుటుంబంలో ఒక కారు ఉన్నా వైెఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు
*కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం