దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. దిశ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు తీసుకోమని పోలీసులను కోరగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పోలీసులు శ్రద్ధ పెట్టి జీరో ఎఫ్ఐఆర్ గనుక రాసి ఉంటే ప్రాణాలు దక్కాయని ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని మరో వాదన వినిపిస్తున్న నేపథ్యంలో జీరో ఎఫైర్ అంశం తెరపైకి వచ్చింది. వెంటనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో, హోంమంత్రి మేకతోటి సుచరిత తో భేటీ అయి ఎఫ్ఐఆర్ కు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఎప్పుడు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఆయన నా ప్రియాతి తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
