ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, ఎల్లోమీడియా ఛానళ్లు తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచలం కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా దొరికిపోయింది. ఇక చంద్రబాబు తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని రగిలించి సీఎం జగన్పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ కూడా సీఎం జగన్ మతం, కులం గురించి పదే పదే ప్రశ్నిస్తున్నాడు. తిరుపతి గడ్డపై నిలబడి టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తుంది..హిందువులేనని, హిందూ నాయకుల కుట్ర లేనిదే ఇలాంటివి జరగవంటూ.. రాష్ట్రంలో క్రిస్టియన్, హిందూవుల మధ్య విద్వేషాలు రగలించేలా పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇంగ్లీష్ మీడియంతో రాష్ట్రంలో మతమార్పిడులను ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందంటూ అర్థం వచ్చేలా చంద్రజ్యోతి పత్రిక అసత్య కథనాలు ప్రచురించింది. అంతే కాదు..టీటీడీ వెబ్సైట్, క్యాలెండర్లో యేసయ్య పదం ఉందంటూ కూడా సదరు పత్రిక టీటీడీ ప్రతిష్ట మసకబారేలా దుష్ప్రచారం చేస్తోంది. ఇలా బాబు, పవన్, ఎల్లోమీడియా ఛానళ్లు చేస్తున్న మత రాజకీయాలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్పై రగడ పార్టనర్ల స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని గడికోట అన్నారు. టీటీడీలో ప్రతి ఒక్కరికి స్వామి దర్శనం ముఖ్యమని..ఆ దిశగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తిరుమలపై చంద్ర నాయుడు, పవన్ నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక సీఎం జగన్ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం తగదని శ్రీకాంత్రెడ్డి హితవు పలికారు. తన పాలనాకాలంలో చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు, పవన్ చెప్పినట్లయితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. మొత్తంగా మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు గడికోట గట్టి సవాలే విసిరారు..
