ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓటుకునోటు గురించి అసెంబ్లీ లో ప్రస్తావించారు. అది అవినీతి చట్టం కిందకు రాదని ఆయన అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడిన సందర్భంగా ఓటుకు నోటు కేసు గురించి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని… అది అవినీతి నిరోధక చట్టం కిందకే రాదని ఆయన చెప్పారు. కాగా ఇది రాజకీయ ప్రేరేపిత కేసని కోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. జగన్ పై అక్రమంగా పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ మీలా నేరాలు చేశారా? అని ప్రశ్నిస్తు పవన్ కళ్యాణ్ ను వెనకేసుకొచ్చారు. మారకపోతే తెలంగాణలో మాదిరిగా ఏదో ఒక రేప్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేస్తామని తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని పొంతనలేని ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల ఆర్థిక మూలాలపై దాడులు చూస్తున్నారని ఈ పరిస్ధితులను గవర్నర్, కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని, వారు తమకు ఆసరాగా నిలుస్తారని ఆశిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారారు.
