వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం కేసులో టీడీపీ సానుభూతిపరులైన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తదనంతరం టీటీడీ వెబ్సైట్లో, క్యాలెండర్లలో యేసు పదం ఉందంటూ చంద్రజ్యోతి పత్రిక బురద జల్లుతూ పచ్చ కథనాలు పచ్చిగా వండివార్చింది.దీంతో వివరణ ఇచ్చిన టీటీడీ ఈ మేరకు చంద్రజ్యోతి పత్రికపై 100 కోట్ల దావా వేసేందుకు సిద్ధమైంది. తాజాగా శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంపై కూడా కొన్ని శక్తులు పనిగట్టుకుని వాట్సాప్లో దుష్ప్రచారం చేసిన ఘటన బయటపడింది. ‘తిరుపతి లడ్డా లేదా జీసెస్ లడ్డా?’ అనే శీర్షికతో డిసెంబర్ 29న వాట్సాప్లో ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమైంది. వాట్సాప్లో తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వాట్సాప్లో ఈ సమాచారాన్ని పంపిన వారిపై తిరుమలలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కేసు నమోదు అయింది. ఇలాంటి అవాస్తవ సమాచారం ఇకపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాకుండా నిలువరించేందుకు క్రైం నంబర్ 2/2020 యూ/ఎస్ 500, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద టీటీడీ విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు. మొత్తంగా వెంకన్న భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూపై వాట్సాప్లో జరిగిన అసత్య ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇకపై తిరుమల ప్రతిష్ట దిగజార్చుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
