విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పారు.దీనితో పాటు కనకదుర్గ గుడి వద్ద కూడా ప్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు మరింత సదుపాయంగా ఉంటుంది.బెంజ్ సెంటర్ ప్లైఓవర్ ను రామవరప్పాడు వరకు పొడిగించి ఉంటే బాగుండేదని పలువురి అబిప్రాయం.
