ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..మేం అందులో జోక్యం చేసుకోమని స్పష్టంగా చెప్పినా..టీడీపీ ఎంపీ గల్లా జయ్దేవ్ మాత్రం ఇంకా గోల చేస్తూనే ఉన్నారు.. అసలు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని రైతులను రెచ్చగొడుతూ..ఆందోళనలు చేయిస్తున్నా…కేంద్రం పెద్దగా స్పందించ లేదు..వికేంద్రీకరణ బిల్లుపై తన వైఖరిని ఎటూ తేల్చక నాన్చుతుంది. దీంతో మోదీ, అమిత్షాలు, మూడు రాజధానుల వ్యవహారంలో సీఎం జగన్పై ఆగ్రహంతో ఉన్నారని..చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా రకరకాలుగా ప్రచారం చేసింది.
అయితే టీడీపీ ఎంపీ గల్లా జయ్దేవ్ అత్యుత్సాహానికి పోవడంతో కేంద్రం రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చింది. రాజధానిపై జోక్యం చేసుకోవాలంటూ…గల్లాజయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. 2015లోనే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని నిత్యానంద్రాయ్ చెప్పారు. అయితే రాజధాని ఎక్కడనే విషయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది..కాబట్టి మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే కేంద్రం రాజధానిపై ఇంత క్లారిటీగా చెప్పినా.. గల్లా మాత్రం పార్లమెంట్లో తన గోలను కంటిన్యూ చేస్తున్నారు.
తాజాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా గల్లా మరోసారి అమరావతిపై వితండవాదన చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని..కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందేనని అడ్డగోలుగా వాదించారు. విభజన చట్టంలో రాజధాని అని ఉందే తప్పించి..రాజధానులు అని ఎక్కడా లేదని, ఆఖరకు కేంద్రమంత్రి ఇచ్చిన వివరణలో కూడా రాజధాని అనే ప్రస్తావించారే కానీ..రాజధానులు అని చెప్పలేదని… చిత్రమైన మెలిక పెట్టారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని డెవలప్ చేసే బాధ్యత కేంద్రం మీద ఉందన్న ఆయన.. రాజధానికి ఏదైనా మార్పులు చేయాలంటే విభజన చట్టానికి సవరణలు చేయాలంటూ లాజిక్ లేని వాదనలు వినిపించారు. మొత్తంగా కేంద్రాన్ని పదేపదే రెచ్చగొట్టి…మూడు రాజధానులపై జగన్ సర్కార్ను ముందుకు వెళ్లకుండా చేయాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగా గల్లాగారు పార్లమెంట్లో గోల గోల చేస్తున్నారు…అయినా కేంద్రం అంత స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీ గోల ఏంటీ గల్లాగారు…మీ లొల్లి మరీ సిల్లీగా లేదు..