భీమవరంలో ఏ సమస్య వచ్చినా అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముందుంటారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర మొత్తం ఎక్కడ పోటీచేసినా గెలుస్తాం అని చెప్పుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలమైన సామాజిక వర్గం పెట్టుకుని సొంత జిల్లా గా పిలువబడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓడిపోయి అంటే గంధి శీను ప్రజా బలాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి నాటినుండి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న గ్రంధి శ్రీను తాజాగా మరో ఉదార గుణాన్ని ప్రదర్శించారు. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అత్యవసరమైన వైద్యానికి సంబంధించి నిర్మాణం చేపట్టడానికి భీమవరంలో తను లేకపోవడంతో తన నాలుగు ఎకరాల స్థలాన్ని హాస్పిటల్ నిర్మాణానికి శీను ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరు ఆయనను ప్రశంసించారు. ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో హాస్పిటల్లో అత్యంత అద్భుతంగా తీర్చి దిద్దే ఈ ప్రాంత ప్రజలకు వైద్య సంబంధించి ఎక్కడికి వెళ్ళకుండా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.