టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడి..ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల పొట్ట కొట్టిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి అన్నారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోంది. ఈఎస్ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. గతంలోనే ఈఎస్ ఐ అవినీతి గురించి తాము చెప్పామని ,ఇప్పుడు అది నిజమేనని తేలిందని ఆయన అన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారింది. మంత్రిగా అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారు. తెలంగాణలో ఎలా కాంట్రాక్టు ఇచ్చారో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలానే ఇచ్చామని అచ్చెన్నాయుడు అంటున్నారు. తెలంగాణలో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్టే కదా’అని గౌతమ్రెడ్డి అన్నారు.అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకొని మోసానికి పాల్పడ్డ సొమ్ము రికవరీ చేయాలి. ఎటువంటి నియమాలు పాటించకుండా రెండు వందలు విలువచేసే ఈసీజీ కి రూ.480 చెల్లించారంటేనే అచ్చెన్నాయుడు అవినీతి తేటతెల్లం అయిందని అంటున్నారు.
