ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. అవి గమనిస్తున్న ప్రజలు రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో వారి సొంత మనుషులే బాగుపడ్డారు తప్ప వేరెవ్వరికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం జిల్లా, మండలం, ఊరు అని కాకుండా అన్ని చోట్ల జగన్ మంచితనంతో ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఐఎంఆర్ మెటలర్జికల్ రిసోర్సెస్-ఎజి అధికారులు జగన్ ను కలిశారు.వైయస్ఆర్ కడప జిల్లాలో 12వేల కోట్లు పెట్టుబడితో మరియు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో జగన్ ను కలిసారు. ఇది జరిగితే ఉద్యోగ అవకాశాలు మరిన్ని పొందవచ్చు.