ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.ఈ 3వారాలు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే ఆరోగ్యం బాగోలేని వారిని గుర్తించడం సులువవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న మనవాళ్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందరం కలిసికట్టుగా ఉంటేనే కరోనాను అడ్డుకోగలం అని సీఎం వైయస్ జగన్ చెప్పారు.ప్రతీ ఒక్కరు ఎక్కడికక్కడ ఉండాలని అన్నారు.
