Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 2,3 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయన పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు వివరించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ వివరాలను కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 2న ఉదయం సీఎం జగన్ తన నివాసం నుంచి బయల్దేరి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు కడప ఎయిర్పోర్టుకు వెళ్తారు. 11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం.. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టిని స్టార్ట్ చేస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్కు వెళ్తారు. 12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ను ప్రారంభిస్తారు. 1.00 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్లో ఇడుపులపాయ హెలిప్యాడ్కు చేరుకుంటారు. 5.00 నుంచి 5.10 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడి, 5.20 కు ఇడుపులపాయలోని గెస్ట్హౌస్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్కు వెళ్తారు. 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం 9.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్లో బయలుదేరతారు. 10.10 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.