Home / ANDHRAPRADESH / కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?

కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది .

ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జీఈఎస్ సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెసిందే .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు నూట యాబై దేశాలకు చెందిన పదిహేను వందలమంది ప్రముఖ వ్యాపార వేత్తలతో పాటు ప్రధాని మోదీ ,కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్ ,అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,వ్యక్తిగత సలహాదారి ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు .

ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో వైఎస్ భారతి దాదాపు నలబై నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ జరిపారు అని ఆ పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .ఈ ప్రత్యేక కథనంలో వైఎస్ భారతి ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ,బాబు సర్కారు గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న రాక్షస పాలన గురించి వివరించారు అని ఆ పత్రిక ప్రచురించింది .అయితే నిజంగా వైఎస్ భారతి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీ అయ్యారా ..?.ఈ భేటీ సందర్భంగా నిజంగా ఏపీ రాజకీయాల ప్రస్తావన వచ్చిందా అనేది కాలమే నిర్ణయించాలి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat