ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ..
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నేను అక్కడ ఉన్నాను కాబట్టే ప్రజలందరు ధైర్యంగా ఉన్నారు. పార్టీ నేతలు నా వెంట నడిచారు. తెలుగుదేశం పార్టీ కి గట్టిపోటీ ఇచ్చాం…చంద్రబాబు నాయుడు రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. రూ.6వేల నుంచి 8 వేలు ఇచ్చి మరీ ఓట్లు కొన్నారు. ప్రలోభాలు పెట్టబట్టే టీడీపీ గెలిచింది. ఉప ఎన్నికకు, సాధారణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది.జగన్ సీఎం అయితే అంతకంటే ఎక్కువ మేలు చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చంద్రబాబుకు ఆ విషయం తెలుసు. అందుకే ఫిరాయింపుదారుల స్థానాల్లో ఉప ఎన్నికలకు భయపడుతున్నారు.నంద్యాలలో లాగ సాధారణ ఎన్నికల్లో చేయడానికి కుదరదుని స్పష్టం చేసారు.మా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. అందరు బాగా పని చేస్తున్నారు. రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. అంతా కలిసికట్టుగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం… అని అన్నారు