విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలు తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు ,కార్యకర్తలు పవన్ కు వ్యతీరేకంగా టీవీ చానెళ్ల ఇంటర్వులో, సోషల్ మీడియాలో , హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే. . కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించాడు. పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని టీడీపీ పార్టీ నాయకులను ఆదేశించారు.
పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా చర్చ సాగుతోంది. నారా లోకేష్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అదే సమయంలో జగన్తో పొత్తు పెట్టుకోనని పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చునని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని, విమర్సలు చేస్తే ఆటంకం ఏర్పడవచ్చునని ఆయన భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సానుకూలంగానే… రాష్ట్ర ప్రభుత్వ పనితీరును పవన్ కల్యాణ్ సానుకూలంగా అర్థం చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శిస్తున్నా, సంయమనం పాటించాలని సూచించారు.