Home / ANDHRAPRADESH / 2019లో ప్ర‌జ‌లే జ‌గ‌న్‌ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!

2019లో ప్ర‌జ‌లే జ‌గ‌న్‌ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని 2019 ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్ర ప్ర‌జ‌లే వెలివేస్తార‌ని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన‌ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ అన్నారు. అత్యున్న‌త దేశ‌మైన భార‌త్‌లో వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ పెట్టిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నార‌న్నారు. 16 నెల‌ల‌పాటు జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన అంత‌ర్జాతీయ నేర‌స్తుడు వైఎస్ జ‌గ‌న్ అని, ప్ర‌తీ శుక్ర‌వారం అత్తారింటికి వెళ్లిన‌ట్లు కోర్టు వాయిదాల‌కు వెళ్లి రావ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటైందంటూ ఎద్దేవ చేశారు. అంత‌ర్జాతీయ దొంగే.. క‌నిపించిన ప్ర‌తీ ఒక్క‌రిని దొంగ‌.. దొంగ అంటూ అరుస్తున్నార‌ని, ఆ మాట‌లు వైఎస్ జ‌గ‌న్ అంటుంటే దొంగే దొంగ‌.. దొంగ అని అరుస్తున్న‌ట్లు ఉంద‌ని చెప్పారు.

రాష్ట్ర ప‌రిపాల‌నా ప‌ద్ధ‌తుల‌ను నిర్ణ‌యించే అసెంబ్లీని న‌డిపించే స్పీక‌ర్‌, ముఖ్య‌మంత్రుల‌పై వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. ఏందేంది..!! అసెంబ్లీ గ‌జ‌దొంగ‌తో న‌డ‌ప‌బ‌డుతుందా..? గ‌జ‌దొంగ చంద్ర‌బాబు కాదు. నీవు అంటూ వైఎస్ జ‌గ‌న్‌నుద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌లీల్ ఖాన్‌. దేశంలోనే అనుభ‌వం గ‌ల రాజ‌కీయ నాయ‌కుడిగా చంద్ర‌బాబుకు మంచి గుర్తింపు ఉంద‌ని, అటువంటి వ్య‌క్తిపై బుర‌ద‌జ‌ల్లేందుకు జ‌గ‌న్ య‌త్నిస్తున్నార‌న్నారు. 2019లోనే కాదు.. నీవు ఎప్ప‌టికీ ముఖ్య‌మంత్రివి కాలేవంటూ జ‌గ‌న్‌నుద్దేశించి అన్నారు జ‌లీల్ ఖాన్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat